అన్నమయ్య: నందలూరు మండలం దుర్గాపురం ఎస్టీ కాలనీలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, వినాయక చవితి సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గాపురం ఎస్టీ కాలనీలో పోలీసుల అవగాహన కార్యక్రమం


