NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం భక్తులు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవికి పల్లకి సేవ


