హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీ ధర్నా

KMR: రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, కుల వివక్షకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.