హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిసాన్ మోర్చా జిల్లా ఇంఛార్జ్‌గా పోచారం రాములు

మెదక్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా పోచారం రాములు నియామకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సూచనల మేరకు ఈ బాధ్యతలు అప్పగించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కిసాన్ మోర్చా వ్యవస్థను గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రాములు చెప్పారు.