హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు నింపాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా నవంబర్‌ 20లోపు అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపాలని కలెక్టర్‌ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాగునీటి పరిస్థితి, రిజర్వాయర్లు, ట్యాంకుల్లో నీటి నిల్వలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.