NLG: నాగార్జున సాగర్లో 180 టీఎంసీల నీరున్నా ఎడమ కాలువ ఆయకట్టుకు విడుదల చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సెప్టెంబర్ 14 (వినాయక చవితి) లోపు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. 2003లో కేసీఆర్ చేపట్టిన విధంగానే, తాను వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానన్నారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 14 లోపు నీళ్లివ్వకపోతే పాదయాత్ర'


