హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవోగా మల్లికార్జున రావు

ELR: జిల్లా పరిషత్ ఇంఛార్జ్ సీఈవోగా జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఈవోగా పని చేసిన పి. జగదాంబ ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేయడంతో ప్రభుత్వం మల్లికార్జునరావుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన ఆయనను తాడేపల్లిగూడెం మండల పరిషత్ ఎంపీడీవో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.