హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీ.ఎం. పర్యటనతో విద్యార్థులకు పాట్లు

VZM: సీ.ఎం.నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి పర్యటనకు బస్సులు అన్ని తరలించడంతో కొత్తవలస నుంచి విశాఖపట్నం, గాజువాక వెళ్ళే బస్సులు లేకపోవడంతో కళాశాలలకు, ఉద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ముందుగా సమాచారం లేకపోవడంతో బస్సు స్టాప్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాంధ్రకు సీ.ఎం.ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.