హైదరాబాద్: 28°C
తెలంగాణ

ALERT: స్నేహమంటారు.. ఆపై వంచిస్తారు.!

HYD: సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. టీనేజర్లతో స్నేహం నటించి, వారి వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను విచక్షణారహితంగా ఆమోదించవద్దని సూచించారు. బాధితులైతే వెంటనే 1930 లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.