హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు నగరం ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ విక్రమ్ నగర్ ఫీడర్‌లో నూతన లైన్లు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు కరెంటు ఉండదన్నారు. విక్రం నగర్ మెయిన్ రోడ్డు, అయ్యప్ప గుడి పరిసరాల్లో కరెంటును నిలిపివేస్తామన్నారు.