హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్‌ భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి'

NRML: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూభారతి, భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 22-ఏ కింద ఉన్న భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.