SRD: సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో పశువుల దవాఖాన ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్య దర్శి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో రైతులు, పశువుల కాపులతో సమావేశం నిర్వహించారు. కొత్లాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి ఉన్నందున పశువుల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
పశువుల దవాఖాన ఏర్పాటు చేయాలి: సీపీఎం


