హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రానున్న మాజీ సీఎం

KRNL: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సెప్టెంబర్‌ 3న కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 11.00 గంటలకు కర్నూలుకు చేరుకుని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి. మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం కర్నూలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.