VSP: భీమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. గృహహింస, వేధింపులకు గురైన మహిళలకు ఒకేచోట తాత్కాలిక ఆశ్రయం, పోలీసు, వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కేంద్రంలో 13 మంది సిబ్బంది సేవలందిస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం


