KNR: జిల్లా కోర్టులో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ యశ్వంత్ సింగ్ తెలిపారు. చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాలు సహా రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశమై లోక్ అదాలత్ విజయవంతంపై చర్చించారు.
తెలంగాణ
ఈనెల 12న కరీంనగర్లో జాతీయ లోక్ అదాలత్


