పార్వతీపురం పట్టణ ప్రజలకు ప్రతిరోజూ పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని సీపీఎం పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా జరగడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'


