హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. నీరు వృథా

SRD: పటాన్‌చెరు లక్షారం ఎక్స్‌రోడ్ వద్ద 65వ జాతీయ రహదారి వెంట మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో మంగళవారం ఉదయం నుంచి తాగునీరు భారీగా వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వేలాది లీటర్ల నీరు రోడ్డుపాలవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లీకేజీకి మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని కోరారు.