హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయులు నిరసన

AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి ZP హైస్కూల్‌లో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉపాధ్యాయులు సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ గుంటూరులో నిర్వహిస్తున్న ర్యాలీకి మద్దతుగా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ర్యాలీలో పాల్గొంటున్న ఉద్యోగ, కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.