PPM: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ముగ్గురు బాధితులకు ఆయన వినికిడి పరికరాలను అందజేశారు. పార్వతీపురం మండలానికి చెందిన పద్మావతి, జమ్మిరాజుపేటకు చెందిన గంగయ్య, కోమటిపేటకు చెందిన మార్కండేయలు ఈ పరికరాల కోసం కలెక్టర్కు అర్జీలు సమర్పించగా, ఆయన స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
వినికిడి పరికరాలు పంపిణీ


