MLG: ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారమల్లు, ఇమ్మాన్యుయేల్కు ఘనంగా వీడ్కోలు పలికారు. అదనపు ఎస్పీ సదానందం శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్ల సుదీర్ఘ సేవలను అధికారులు కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
పదవీ విరమణ పొందిన ఎస్ఐలకు ఘన వీడ్కోలు


