NZB: సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా డీజేలు, సభలు, విగ్రహాల ఏర్పాటు, డ్రోన్ల వినియోగం చేయరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపైనా నిషేధం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 1 నుంచి పోలీసుల ఆంక్షలు'


