VKB: కొండాపూర్లో ఆదివారం రాత్రి చిరుతపులి దాడి చేయడంతో రైతు చెన్నారం వెంకటయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పొలంలో కట్టేసిన ఎద్దుపై చిరుత దాడి చేసి కొంత భాగాన్ని తిన్నది. ఉదయం వెళ్లి చూసేసరికి ఎద్దు విగతజీవిగా పడి ఉండడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
తెలంగాణ
కొండాపూర్లో ఎద్దుపై చిరుత దాడి


