హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృధాగా తాగునీరు

NGKL: అమ్రాబాద్ నుంచి మద్దిమడుగు వెళ్లే ప్రధాన రహదారి చిట్లంకుంట సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. గత కొన్ని రోజులుగా నీరు పోతున్నా పట్టించుకోకపోవడంతో సరైన నీరు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పైపులైన్‌ను రిపేరు చేయాలని కోరుతున్నారు.