హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని నిర్వహించాని పిలుపు

KMM: ఏన్కూర్‌ మండల కేంద్రంలో సేవాలాల్‌ సేన జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు భూక్యా నరసింహారావు మాట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌, పోడు భూములకు పట్టాలు వంటి సాధనలన్నీ సేవాలాల్‌ సేన పోరాటాల ఫలితమేనన్నారు. ఈ నెల 9న సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.