GNTR: తెనాలి శివారు సోమసుందరపాలెం వద్ద ఆదివారం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఓ వ్యక్తిని కొందరు కారులో వచ్చి దాడి చేసి బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ లభించిన స్కూటీని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి శివారులో కిడ్నాప్


