హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

VZM: వ్యావహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో 'తెలుగు భాషా దినోత్సవం' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గేట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ గురాన రాధిక హాజరయ్యారు. ఈ సందర్బంగా రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకున్నారు.