హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిశుద్ధ్యన్ని మెరుగుపరచండి'

MDCL: అల్వాల్ ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. టిమ్స్ రాజీవ్ గాంధీ విగ్రహం, ఏడబ్ల్యూహెచ్‌ఓ కాలనీ సమీపంలోని జంక్షన్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతిరోజూ చెత్త సేకరణ చేపట్టాలని, జంక్షన్ల వద్ద ఆక్రమణలను తొలగించాలని సూచించారు.