హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

ELR: బీసీల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. ఏలూరు 13వ డివిజన్ గాయత్రీ నగర్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.19.40 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రహదారిని ఆయన ప్రారంభించారు.