MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం అటవీ శాఖ, డీఆర్డీఏ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అటవీ శాఖ అధికారులతో కలిసి ఈత మొక్కలు నాటారు. మొక్కలు పెరిగి గీత కార్మికులకు భవిష్యత్తులో ఆసరాగా నిలుస్తాయని తెలిపారు. గీత కార్మికుల హక్కుల కోసం పోరాటతామని అన్నారు.
తెలంగాణ
ఈత మొక్కలు నాటిన సర్పంచ్


