ములుగు (D) కేంద్రంలోని గిరిజనభవన్ ఇండోర్ స్టేడియంలో శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని నిర్వహించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని వెటరన్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు యువతమొబైల్ ఫోన్లకు బానిసకాకుండా క్రీడలు, వ్యాయామంపై దృష్టిసారించాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు.
తెలంగాణ
'క్రీడలపై అవగాహన పెంచుకోవాలి'


