హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్ పీజీ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

KMM: ఈనెల 30న ఖమ్మం పట్టణంలో జరగనున్న నీట్ పీజీ పరీక్షలకు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టినట్లు ఇవాళ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు తో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.