KDP: నగరంలోని మారుతినగర్లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ మూడో శనివారం ప్రత్యేక పూజలు


