హైదరాబాద్: 28°C
తెలంగాణ

చందానగర్‌లో డ్రైన్ పనుల పరిశీలన

RR: వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శేరిలింగంపల్లిలో రూ.79.58 కోట్లతో నాలాల విస్తరణ పనులను వేగవంతం చేశామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. చందానగర్‌లో రూ.18.92 కోట్లతో చేపట్టిన ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్ పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.