హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.