హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు తాడేపల్లి యువకుడు

GNTR: తాడేపల్లి డోలాస్‌నగర్‌కు చెందిన మెరుగుపాల హశిష్ అంతర్జాతీయ జూనియర్ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఫిగర్ స్కేటింగ్-2026కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ పోటీల్లో ఆయన భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. జూన్‌లో డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడంతో ఈ అవకాశం దక్కింది.