హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా బోడ చంద్రశేఖర్

విశాఖపట్నం సెంట్రల్ జైలు నూతన సూపరింటెండెంట్‌గా బోడ చంద్రశేఖర్ నియమితులయ్యారు. మంగళగిరి హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కారాగార భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని, ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఎం.మహేష్ బాబు అదనపు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించనున్నారు.