హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌లో ఓటర్ల సమస్యలు పరిష్కరించాలి

NRML: పట్టణంలోని పంచశీల్ కాలేజీలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పరిశీలించారు. బీఎల్‌ఏ, బీఎల్‌వోల సమావేశానికి హాజరై డిప్యూటీ తహసీల్దార్ శేఖర్‌తో ఓటర్ల సమస్యలపై చర్చించారు. నోటీసులను ఓటర్ల ఇళ్లకే అందించాలని, జాబితాలోని తప్పులను సరిచేసి అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం చేయాలని కోరారు.