హైదరాబాద్: 28°C
తెలంగాణ

​రైతుకు బ్యాంక్ అధికారుల వేధింపులు

VKB: తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన రైతు తాండ్ర బాలప్ప మృతితో ఆయన భార్య లక్ష్మికి రైతు బీమా సొమ్ము మంజూరైంది. అయితే, డ్వాక్రా సంఘం బకాయిల పేరుతో తాండూరు ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్ అధికారులు రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చి, మిగతా మొత్తం ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న తనకు పూర్తి బీమా సొమ్ము అందేలా కోరారు.