హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతం చేయాలి'

SDPT: యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్‌ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ పిలుపునిచ్చారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఏఐవైఎఫ్‌ నాయకులతో కలిసి మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపాధి, విద్య, ఉద్యోగ సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.