హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌకూర్ సమస్యలపై ఎమ్మెల్యే విజ్ఞప్తి

MDCL: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కౌకూర్‌లో పలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూముల సరిహద్దులు నిర్ధారించాలని, దర్గా నుంచి బిట్స్ పిలానీ వరకు రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. నీటి నాలా ఆక్రమణలు తొలగించి, పేద మహిళలకు కుట్టుమిషన్లు అందించాలని కోరారు.