హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

కృష్ణా: రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గతంలో పోలింగ్‌ కేంద్రంగా ఉన్న ఏయిడెడ్‌ పాఠశాల రద్దు కావడంతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా పెడన మార్కెట్‌ యార్డులోని అగ్రి ల్యాబ్‌ను మున్సిపల్‌ మేనేజర్‌ సుందరం మంగళవారం పరిశీలించారు.