PPM: సాలపదం పంచాయతీ రెబ్బ, వనధార గ్రామాల రహదారి అసంపూర్తిగా ఉండటంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండగా, వనధారకు చెందిన ఐదేళ్ల యశ్వంత్కు జ్వరం రావడంతో తండ్రి ఐదు కిలోమీటర్లు భుజంపై మోసుకుని తీసుకెళ్లారు. ప్రారంభించిన రహదారి పనులను వెంటనే పూర్తి చేసి రాకపోకల సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహదారి లేక గిరిజనులు తీవ్ర అవస్థలు


