హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లంచం అడిగితే సమాచారం ఇవ్వండి'

అన్నమయ్య: మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. SRO, సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.1. 25 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారాం తెలిపారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.