VSP: GVMCలో 79 పంచాయతీల విలీన ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. తొలిదశలో ఆనందపురంలోని 26 పంచాయతీల్లో 26, 27 తేదీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. విలీనంపై ప్రజల అభిప్రాయాలు, తీర్మానాలు నమోదు చేయనున్నారు. అనంతరం పద్మనాభంలో 22, భీమిలి రూరల్లో 16, పెందుర్తిలో 15 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీల విలీనానికి గ్రామసభలు


