హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరంట్లలో 29న ఉద్యోగమేళా

సత్యసాయి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న గోరంట్ల ఏఎన్‌కే డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. 18–35 ఏళ్ల వయస్సు, పదో తరగతి లేదా ఆపై చదివిన నిరుద్యోగులు అర్హులు. టాటా ఎలక్ట్రానిక్స్, కియా ఇండియా, బర్గర్ పెయింట్స్, అపోలో టైర్స్ తదితర కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వివరాలకు 77020 02059, 7989888299 నంబర్లను సంప్రదించాలి.