HNK: వివిధ నేరాల్లో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈ నెల 25న ఉ.11 గం పరకాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సీఐ పి.తాతాజీ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు వాహనం నిర్ణయించిన అప్సెట్ ధరలో 50 శాతం డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తిగల వారు నిర్ణీత సమయానికి హాజరై నిబంధనల ప్రకారం పాల్గొనాలన్నారు.
తెలంగాణ
రేపు వాహనాల బహిరంగ వేలం


