హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారు నెక్లెస్‌ మోసం.. నలుగురిపై కేసు

KDP: ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలో 59 గ్రాముల బంగారు నెక్లెస్‌ను తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్మకమైన వారంటూ పరిచయం చేసి నెక్లెస్‌ తీసుకున్నారని బాధితుడు సద్దాం ఫిర్యాదు చేశారు. క్రైం నంబర్‌ 174/2026 కింద కేసు నమోదు చేసి ఎస్సై మధుసూదన్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.