W.G: శ్మశాన వాటికలను పవిత్ర స్థలాలుగా భావించి సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం తిల్లపూడిలో రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో గ్రామస్థులతో కలిసి ఆయన శ్రమదానం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలపాలని కృషి చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్మశాన వాటికల సుందరీకరణే లక్ష్యం: మంత్రి


