హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో NCST సభ్యుడి పర్యటన

BDK: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని గిరిజన గ్రామాలను సందర్శించి ప్రజలతో సమావేశమవుతారు. అశ్వాపురంలో హెవీ వాటర్ బోర్డు ఉద్యోగులు, అధికారులతో భేటీ అనంతరం 25న కలెక్టరేట్‌లో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించనున్నారని ఇందుకు సంబంధించిన షెడ్యుల్‌ను అధికారులు విడుదల చేశారు.