ASR: అరకులోయ మండలంలో 14 గ్రామ పంచాయతీలలో 2026 రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను అధికారులు ప్రచురించారు. ఎంపీడీవో కార్యాలయం, గ్రామ పంచాయతీ, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. ప్రజలు జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు, సూచనలను ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని ఎంపీడీవో వీసం ప్రసాద్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ


